బుగ్గపాడు భూ దోపిడీపై విచారణ జరిపించాలి.

బుగ్గపాడు భూ దోపిడీపై విచారణ జరిపించాలి.

* *అవినీతి అక్రమల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత్రపై దర్యాప్తు చేయాలి*

* *మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్*

* *అక్రమంగా మట్టి, కలప రవాణా చేస్తున్నారు*

ఖమ్మం బ్యూరో, జూన్ 20(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం జిల్లా బుగ్గపాడు ఫుడ్ పార్కులో జరిగిన భూ దోపిడీపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మార్కెట్ విలువకు విరుద్ధంగా అనుయాయుల కంపెనీకి ఫుడ్ పార్క్ భూములు విక్రయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవినీతి, అక్రమాలపై పారదర్శకంగా దర్యాప్తు చేయాలని అన్నారు. 

అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా సీతారామ ప్రాజెక్టు కాలువ మట్టిని, కలపను అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని పువ్వాడ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ప్రతి భూ దందాల్లో, మట్టి, ఇసుక మాఫియాల వెనుక మంత్రులు పాత్ర ఉందని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫుడ్ పార్క్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ. మాజీ సర్పంచ్ అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ.
వనపర్తి,జూన్20(తెలంగాణ ముచ్చట్లు): తాటిపాముల గ్రామ మాజీ సర్పంచ్  అనసూయమ్మ రెండో వర్ధంతి సందర్భంగా తాటిపాముల ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు....
బుగ్గపాడు భూ దోపిడీపై విచారణ జరిపించాలి.
ప్రజల పక్షాన పోరాటమే టీఆర్‌ఎస్ లక్ష్యం.
యోగతో ఆరోగ్యకర జీవనం సాధ్యం.
గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.
అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి... 
అటవీ–రెవెన్యూ భూముల సరిహద్దులపై స్పష్టతకు చర్యలు!