మద్దిగట్ల పాఠశాలలో వైభవంగా అక్షరాభ్యాసం.

మద్దిగట్ల పాఠశాలలో వైభవంగా అక్షరాభ్యాసం.

పెద్దమందడి,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం  మద్దిగట్ల ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు  శివరాజ్, ఉపాధ్యాయులు రమేష్, విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి మంజులత, పాఠశాల సముదాయ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.సరస్వతి మాత చిత్రపటానికి పూజలు నిర్వహించిన అనంతరం పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు పలకలు, బలపాలు అందజేసి అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ  మంజులత మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ..విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే పునాదిగా నిలుస్తుందని అన్నారు.ప్రధానోపాధ్యాయులు  శివరాజ్ పాఠశాలలో డిజిటల్ విద్యతో పాటు నాణ్యమైన బోధన అందిస్తున్నట్లు తెలిపారు.అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి, చాక్లెట్లు అందజేశారు.కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.
- ప్రణవ్ బాబు కృషితో సాధ్యమైన అభివృద్ధి: కాంగ్రెస్ నేతల హర్షం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రణవ్ బాబుకు పాలాభిషేకం జమ్మికుంట టౌన్ జూన్...
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.. కార్మికులకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్.
భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!
ఖమ్మంలో ఘనంగా టాలీ సర్టిఫైడ్ పార్టనర్ సంస్థ ఆఫీస్ ప్రారంభం.
ముడిసరుకు ధరల భారం.. జమ్మికుంటలో ఫోటోగ్రాఫర్ల బంద్ జయప్రదం"
ఇందిరమ్మ ఇళ్లలో ఆనంద దీపాలు.. గృహ ప్రవేశాల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్.
గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.