బడి బాట కార్యక్రమానికి గ్రామ ప్రజల విశేష స్పందన.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపుపై అవగాహన.
భీమదేవరపల్లి, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు):
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన బడి బాట కార్యక్రమం గ్రామంలో ఉత్సాహంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, చిట్కూరి అనిల్, ప్రెస్ కొమురయ్య, ఎదులపురం తిరుపతి, గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యా కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి విద్యా భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని కోరారు.
"మన ఊరు – మన బడి, ప్రతి పిల్లవాడికి విద్యే పెద్ద ఆస్తి" అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో విద్య పట్ల మరింత చైతన్యం కలిగించింది.


Comments