విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌ల పంపిణీ.

విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌ల పంపిణీ.

పెద్దమందడి,జూన్15(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం  మణిగిల్ల ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం అందజేసిన ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లను గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అడ్డాకుల వెంకటేశ్, నస్రీన్ బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి సమాజంలో ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉభయ పాఠశాలల ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, గ్రామ పెద్దలు సుంచరామోని రాములు, పోతుల రామిరెడ్డి, పొంది ప్రతాప్ రెడ్డి, మందడి బంధి, మండల శ్రీనివాస్, రాములు, సాగర్, బోడి గణేష్, బి.కే. నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చెల్పూర్ పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ. చెల్పూర్ పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ.
హుజురాబాద్,జూన్ 16(తెలంగాణ ముచ్చట్లు ): కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్‌తో కలిసి చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య...
బలీదుపల్లిలో అవినీతి ఆరోపణలు అవాస్తవం.. సర్పంచ్, రైతులు, మహిళల స్పష్టీకరణ.
గ్రామాల అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరిన సర్పంచ్‌లు.
చిన్నారుల విద్యా భవిష్యత్తుకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు.
అక్రమ మొరం తరలింపు.. ట్రాక్టర్, జేసీబీ స్వాధీనం.
దమ్మపేటలో రూ.1.20 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం!