గ్రామాల అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరిన సర్పంచ్లు.
Views: 0
On
వేలేరు, జూన్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలంలోని పీచర, సోడశపెల్లి గ్రామాల అభివృద్ధి కోసం ఆయా గ్రామాల సర్పంచ్లు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
(ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్) ఉపాధి హామీ పథకం నిధులను వేలేరు మండలంలోని అన్ని గ్రామాలకు కేటాయించినప్పటికీ, పీచర మరియు సోడశపెల్లి గ్రామాలకు మాత్రం నిధులు కేటాయించలేదని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో రెండు గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీచర గ్రామ సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు, సోడశపెల్లి గ్రామ సర్పంచ్ వెన్నం రమాదేవి సంపత్ రెడ్డి పాల్గొని తమ గ్రామాల అభివృద్ధి అవసరాలను ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
16 Jun 2026 21:45:23
హుజురాబాద్,జూన్ 16(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రభుదాస్తో కలిసి చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య...


Comments