బలీదుపల్లిలో అవినీతి ఆరోపణలు అవాస్తవం.. సర్పంచ్, రైతులు, మహిళల స్పష్టీకరణ.

బలీదుపల్లిలో అవినీతి ఆరోపణలు అవాస్తవం.. సర్పంచ్, రైతులు, మహిళల స్పష్టీకరణ.

అడ్డాకల్, జూన్15(తెలంగాణ ముచ్చట్లు):

మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండలం బలీదుపల్లి గ్రామంలో ఆర్టీఐ ద్వారా చేస్తున్న అవినీతి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని గ్రామ సర్పంచ్ కోట్ల కరుణాకర్ రెడ్డి, రైతులు, మహిళలు స్పష్టం చేశారు. మంగళవారం  ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, మహిళా సంఘాలు, వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు.వరి కొనుగోళ్లలో రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు జరిగాయని రైతులు పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో చెల్లింపులు సక్రమంగా జమయ్యాయని, ఎలాంటి అక్రమాలకు తావులేదని వివరించారు.అలాగే గ్రామ మహిళా సంఘాల నిర్వహణలోనూ ఎలాంటి అవకతవకలు జరగలేదని మహిళలు తెలిపారు.కొందరు వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో గ్రామ ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు.గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, సామాజిక మాధ్యమాలు మరియు ఇతర వేదికల ద్వారా తప్పుడు ప్రచారం చేయకుండా గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని సర్పంచ్, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చెల్పూర్ పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ. చెల్పూర్ పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ.
హుజురాబాద్,జూన్ 16(తెలంగాణ ముచ్చట్లు ): కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ శ్రీరాం, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రభుదాస్‌తో కలిసి చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య...
బలీదుపల్లిలో అవినీతి ఆరోపణలు అవాస్తవం.. సర్పంచ్, రైతులు, మహిళల స్పష్టీకరణ.
గ్రామాల అభివృద్ధికి సహకరించాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరిన సర్పంచ్‌లు.
చిన్నారుల విద్యా భవిష్యత్తుకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని మనోజ్ రావు.
అక్రమ మొరం తరలింపు.. ట్రాక్టర్, జేసీబీ స్వాధీనం.
దమ్మపేటలో రూ.1.20 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం!