ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా అందించాలి.

కలెక్టర్‌కు సమాచార హక్కు సాధన కమిటీ వినతి.

ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా అందించాలి.

హుజురాబాద్ జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రతి సామాన్య పౌరుడికి ప్రభుత్వ కార్యాలయాల నుంచి అందాల్సిన సమాచారాన్ని పారదర్శకంగా, సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

జాతీయ అధ్యక్షులు డా. చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం అమలులో పారదర్శకత పెంపొందించి, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచాలని వినతిపత్రంలో కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బండ నరేందర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమని, ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు దాట్ల శ్రీనివాస్, తిరగమల్ల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.IMG-20260615-WA0164

Tags:

Post Your Comments

Comments

Latest News

నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలి. నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలి.
వేంసూరు, జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు): ఇటీవల కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు నివాసాలు దెబ్బతిని నష్టపోయిన పేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని...
ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా అందించాలి.
వైయస్సార్ నగర్ లోని గుడిసెలను తొలగించవద్దు .
ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇంటి పన్ను – నల్లా పన్ను రద్దు.
కళాశాల గ్రౌండ్ పరిరక్షణే లక్ష్యం.. ఆక్రమణలను అడ్డుకోవాలి: బీజేపీ.
కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం.
రక్తదానం మహాదానం.. వైద్యుల సూచనలతోనే రక్తదానం చేయాలి.