కళాశాల గ్రౌండ్ పరిరక్షణే లక్ష్యం.. ఆక్రమణలను అడ్డుకోవాలి: బీజేపీ.

కళాశాల గ్రౌండ్ పరిరక్షణే లక్ష్యం.. ఆక్రమణలను అడ్డుకోవాలి: బీజేపీ.

హుజూరాబాద్, జూన్ 15(తెలంగాణ ముచ్చట్లు ):

పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విలువైన మైదానాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళాశాల గ్రౌండ్ విద్యార్థులకు క్రీడలు, వ్యాయామం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడే ప్రజా ఆస్తి అని ఆయన పేర్కొన్నారు.
పట్టణ అభివృద్ధి పేరుతో లేదా ఇతర కారణాలతో మైదానాన్ని ఆక్రమించేందుకు చేసే ప్రయత్నాలను వెంటనే అడ్డుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, క్రీడా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గ్రౌండ్‌ను యథాతథంగా పరిరక్షించాలని ప్రభుత్వ అధికారులను ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రభుత్వ స్థలాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న తూర్పాటి రాజు, కళాశాల గ్రౌండ్‌పై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, క్రీడాకారులు కలిసి గ్రౌండ్ పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలి. నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలి.
వేంసూరు, జూన్ 15 (తెలంగాణ ముచ్చట్లు): ఇటీవల కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు నివాసాలు దెబ్బతిని నష్టపోయిన పేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని...
ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా అందించాలి.
వైయస్సార్ నగర్ లోని గుడిసెలను తొలగించవద్దు .
ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇంటి పన్ను – నల్లా పన్ను రద్దు.
కళాశాల గ్రౌండ్ పరిరక్షణే లక్ష్యం.. ఆక్రమణలను అడ్డుకోవాలి: బీజేపీ.
కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం.
రక్తదానం మహాదానం.. వైద్యుల సూచనలతోనే రక్తదానం చేయాలి.