ముడిసరుకు ధరల భారం.. జమ్మికుంటలో ఫోటోగ్రాఫర్ల బంద్ జయప్రదం"
నేటి నుంచి కొత్త ధరల అమలు..
జమ్మికుంట టౌన్ జూన్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలంలోని ఫోటో స్టూడియోల యజమానులు చేపట్టిన బంద్ విజయవంతంగా ముగిసిందని ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఎండి. ముస్తఫా తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్టూడియో యజమానులు, ఫోటోగ్రాఫర్లు మరియు సంఘ సభ్యులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్లో ముడిసరుకుల ధరలు, ప్రింటింగ్ వ్యయాలు, స్టూడియోలకు అవసరమైన పరికరాలు మరియు ఇతర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సేవల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఫోటో స్టూడియో సేవల ధరలను స్వల్పంగా సవరించినట్లు వెల్లడించారు.
సవరించిన నూతన ధరలు జూన్ 18 నుంచి జమ్మికుంట మండలంలోని అన్ని ఫోటో స్టూడియోలలో అమలులోకి వస్తాయని తెలిపారు. వినియోగదారులు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నింటి నాగేందర్, మండల అధ్యక్షులు ఎండి. ముస్తఫా, ఉపాధ్యక్షులు ఎండి. అజార్, ప్రధాన కార్యదర్శి దొడ్డె ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు పొనగంటి విజయ్రాజుతో పాటు ఫోటోగ్రాఫర్లు రత్నకుమార్, రాంబాబు, రవి, సునీల్, ఉపేందర్, తోట రాజేందర్, గౌతం, నాని, శ్రీను, ప్రవీణ్, అంబాల హరీష్, సురోజు శ్రీనాథ్, మడుపు సంతోష్, జానీ, ప్రేమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.


Comments