భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!

ఎమ్మెల్యే రాగమయి.

భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!

సత్తుపల్లి, జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):

భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పిలుపునిచ్చారు. పెనుబల్లి మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం లంకపల్లి పాఠశాల విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటుతూ పచ్చదనం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందని అన్నారు. కార్యక్రమంలో పెనుబల్లి తహసీల్దార్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, రామచంద్రపురం సర్పంచ్ ఎస్.కే. రిజ్వానా కరీముల్లా, లంకపల్లి సర్పంచ్ రాజా, అటవీ శాఖ సబ్‌ డీఎఫ్‌వో, ఎఫ్‌ఆర్‌వో మల్లయ్య, ఎఫ్‌డీవో, డీఆర్‌వో, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.IMG-20260618-WA0116

Tags:

Post Your Comments

Comments

Latest News

పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.
- ప్రణవ్ బాబు కృషితో సాధ్యమైన అభివృద్ధి: కాంగ్రెస్ నేతల హర్షం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రణవ్ బాబుకు పాలాభిషేకం జమ్మికుంట టౌన్ జూన్...
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.. కార్మికులకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్.
భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!
ఖమ్మంలో ఘనంగా టాలీ సర్టిఫైడ్ పార్టనర్ సంస్థ ఆఫీస్ ప్రారంభం.
ముడిసరుకు ధరల భారం.. జమ్మికుంటలో ఫోటోగ్రాఫర్ల బంద్ జయప్రదం"
ఇందిరమ్మ ఇళ్లలో ఆనంద దీపాలు.. గృహ ప్రవేశాల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్.
గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.