జీతాల జాప్యంతో 108 ఉద్యోగుల ఆందోళన.

జీతాల జాప్యంతో 108 ఉద్యోగుల ఆందోళన.

మహబూబ్‌నగర్,జూన్17(తెలంగాణ ముచ్చట్లు):

ఆపదలో ప్రజలకు అండగా నిలిచే 108 అంబులెన్స్ సిబ్బంది ప్రస్తుతం జీతాల జాప్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 71 అంబులెన్సుల్లో సుమారు 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (ఈఎంటీలు), డ్రైవర్లకు గత రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లల ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల ఖర్చులు భరించడం కష్టంగా మారిందని తెలిపారు.ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నప్పటికీ, అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా విధులు నిర్వర్తిస్తున్నామని సిబ్బంది పేర్కొంటున్నారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటికైనా ప్రభుత్వం బకాయి నిధులు విడుదల చేసి, ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. పాలాభిషేకాలతో కృతజ్ఞతలు.. రూ.45 కోట్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.
- ప్రణవ్ బాబు కృషితో సాధ్యమైన అభివృద్ధి: కాంగ్రెస్ నేతల హర్షం - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రణవ్ బాబుకు పాలాభిషేకం జమ్మికుంట టౌన్ జూన్...
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.. కార్మికులకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్.
భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!
ఖమ్మంలో ఘనంగా టాలీ సర్టిఫైడ్ పార్టనర్ సంస్థ ఆఫీస్ ప్రారంభం.
ముడిసరుకు ధరల భారం.. జమ్మికుంటలో ఫోటోగ్రాఫర్ల బంద్ జయప్రదం"
ఇందిరమ్మ ఇళ్లలో ఆనంద దీపాలు.. గృహ ప్రవేశాల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్.
గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.