ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, వివాహ వేడుకలో పాల్గొన్న చైర్పర్సన్ సుహాసిని మనోజ్ రావు.
హుజూరాబాద్, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు ):
హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు పట్టణంలోని 19వ వార్డులో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
అనంతరం 14వ వార్డు కౌన్సిలర్ గంట రమేష్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన చైర్పర్సన్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమైన చైర్పర్సన్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల శుభకార్యాల్లోనూ భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్, వార్డు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, బంధు
మిత్రులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.


Comments