వంగరలో బాలవికాస్ వాటర్ ప్లాంట్ ప్రారంభం.
స్వచ్ఛమైన తాగునీటి అందుబాటుకు మరో ముందడుగు: సర్పంచ్ గజ్జల సృజన రమేష్
వంగర, జూన్ 17(తెలంగాణ ముచ్చట్లు):
వంగర గ్రామ పంచాయతీ పరిధిలోని పీవీ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలవికాస్ వాటర్ ప్లాంట్ను గ్రామ సర్పంచ్ గజ్జల సృజన రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో మాట్లాడిన సర్పంచ్ గజ్జల సృజన రమేష్, గ్రామ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో బాలవికాస్ సంస్థ సహకారంతో ఈ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛమైన తాగునీరు అత్యంత అవసరమని, ఈ ప్లాంట్ ద్వారా పీవీ నగర్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. అలాగే ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన బాలవికాస్ సంస్థ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ, గ్రామ ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్తులో కూడా గ్రామాభివృద్ధికి ప్రజల సహకారంతో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే దిశగా ఈ వాటర్ ప్లాంట్ ఒక మైలురాయిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో బాలవికాస్ ప్రతినిధులు కెడం లింగమూర్తి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రతినిధులు, వార్డు సభ్యులు రఘునాయకుల మహేష్ రెడ్డి, మారం సతీష్, గజ్జల రమేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగిరెడ్డి సతీష్, వాటర్ ప్లాంట్ కమిటీ సభ్యులు కొండ తిరుపతి, మాజీ సర్పంచ్ రఘునాయకుల వెంకటరెడ్డి, నల్లగోని ప్రభాకర్, గ్రామ పెద్దలు చెప్పాల తిరుపతిరెడ్డి, సతీష్ రెడ్డి, చంద్రారెడ్డి, కాల్వ సంపత్, ఉల్లాల రాజమౌళి, రవి, మహేష్, సంజీవ్, శ్రీనివాస్, ఇందిరా, మంజుల, వనజ, రాజయ్య, స్వామి, పరమేష్, బత్తుల వెంకటమ్మ, సదానందం తదితరులు పాల్గొన్నారు.


Comments