ప్రజల పక్షాన పోరాటమే టీఆర్‌ఎస్ లక్ష్యం.

దామోదర్ గౌడ్ దేవరకద్ర ఇంచార్జ్.

ప్రజల పక్షాన పోరాటమే టీఆర్‌ఎస్ లక్ష్యం.

మదనాపురం,జూన్20(తెలంగాణ ముచ్చట్లు):

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తూ ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) దేవరకద్ర ఇన్‌చార్జ్ జి. దామోదర్ గౌడ్ అన్నారు. శనివారం మదనాపురం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దామోదర్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించగా, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా దామోదర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజల హక్కుల పరిరక్షణ, రైతుల సంక్షేమం, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించిందన్నారు.అధికారమే లక్ష్యంగా కాకుండా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడడమే పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ వెంకట రామమూర్తి, మహబూబ్‌నగర్ ఇన్‌చార్జ్ ప్రభాకర్, వనపర్తి జిల్లా ఇన్‌చార్జ్ కరాటే శీను, నాయకులు మహేందర్ రెడ్డి, విజయ్, స్వామి, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాజీ సర్పంచ్ అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ. మాజీ సర్పంచ్ అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ.
వనపర్తి,జూన్20(తెలంగాణ ముచ్చట్లు): తాటిపాముల గ్రామ మాజీ సర్పంచ్  అనసూయమ్మ రెండో వర్ధంతి సందర్భంగా తాటిపాముల ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు....
బుగ్గపాడు భూ దోపిడీపై విచారణ జరిపించాలి.
ప్రజల పక్షాన పోరాటమే టీఆర్‌ఎస్ లక్ష్యం.
యోగతో ఆరోగ్యకర జీవనం సాధ్యం.
గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం.
అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి... 
అటవీ–రెవెన్యూ భూముల సరిహద్దులపై స్పష్టతకు చర్యలు!