అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి.
అధికారుల నిర్లక్ష్యానికి మూల్యం.. రూ.90 వేల మేకలు దొంగల పాలయ్యాయి
పనిచేయని సీసీ కెమెరాలే దొంగలకు అండా..?
వేలేరు, జూన్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన పోలు కోమారికి చెందిన 6 మేకలను గత బుధవారం రోజున గుర్తుతెలియని దుండగులు రాత్రి వేళ మేకల కొట్టం నుంచి ఎత్తుకెళ్లారు. దొంగిలించబడిన మేకల విలువ సుమారు రూ.90 వేల వరకు ఉంటుందని బాధితుడు వాపోయాడు.గ్రామంలో సంవత్సరాలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలు నిర్భయంగా తమ పనులు కానిచ్చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. గతంలోనూ పలు మూగజీవాల దొంగతనాలు జరిగినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
"సీసీ కెమెరాలు ఉంటే దొంగలు దొరికేవారు.. కానీ అవి నిర్వీర్యంగా మారడంతో దొంగలకు గ్రామం అడ్డాగా మారింది" అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Comments