చింత వరుణ్ తేజ్ మృతి ఆ కుటుంబానికి తీరని లోటు.

సింగపురం ఇందిరా,కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ .

చింత వరుణ్ తేజ్ మృతి ఆ కుటుంబానికి తీరని లోటు.

స్టేషన్ ఘనపూర్,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):

స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీకి చెందిన చింత వరుణ్ తేజ్ ఇటీవల ప్రమాదవశాత్తు ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన పట్ల స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సింగపురం ఇందిరా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించిన ఆమె, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.

యువకుడి అకాల మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చిన సింగపురం ఇందిరా, ఈ నష్టం ఆ కుటుంబానికి తీరనిదని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సింగపురం నాగయ్య, సీనియర్ నాయకులు సింగపురం వెంకటయ్య, చింత ఎల్లయ్య, చింత జోగి, సింగపురం సందీప్, రాజ్‌కుమార్, రాజవరపు ప్రసాద్, చింత రాజు, చింత శ్యామ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన టెన్త్ క్లాస్ బ్యాచ్ మిత్రులు. స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన టెన్త్ క్లాస్ బ్యాచ్ మిత్రులు.
స్టేషన్ ఘనపూర్,జూన్24(తెలంగాణ ముచ్చట్లు): తాటికొండ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మారపాక బుచ్చయ్య మరణం పట్ల ఆయన కుటుంబానికి టెన్త్ క్లాస్ 2004-05 బ్యాచ్...
కార్మిక గర్జన సభకు ఎంపీ కడియం కావ్యకు ఆహ్వానం .
గ్రామాల అభివృద్ధే ధ్యేయం.
చింత వరుణ్ తేజ్ మృతి ఆ కుటుంబానికి తీరని లోటు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్‌ను కలిసిన  టిఐసీసీఐ  రాష్ట్ర నాయకులు.
57వ డివిజన్ బూత్ స్థాయి ఎన్నికల బాధ్యుల సమావేశం.