కార్మిక గర్జన సభకు ఎంపీ కడియం కావ్యకు ఆహ్వానం .
హన్మకొండ,జూన్24(తెలంగాణ ముచ్చట్లు):
భవన నిర్మాణ రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమ హక్కుల సాధన లక్ష్యంగా జూలై 5న హనుమకొండ జిల్లా మడికొండలోని కరిష్మా గార్డెన్లో నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాల కార్మిక గర్జన మహాసభకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యను భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
బీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం ఆదేశాల మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిన్నారపు మహేందర్, హనుమకొండ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి భిక్షపతి, జిల్లా సహ కన్వీనర్ ఉపేందర్ కలిసి ఎంపీ కడియం కావ్యకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, నిర్మాణ కార్మికుల హక్కుల పరిరక్షణ అంశాలపై చర్చించినట్లు నాయకులు తెలిపారు. మహాసభకు తప్పకుండా హాజరవుతానని ఎంపీ కడియం కావ్య హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
జూలై 5న జరిగే కార్మిక గర్జన మహాసభను విజయవంతం చేయాలని, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిన్నారపు మహేందర్ పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.


Comments