జమ్ములమ్మ అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

జమ్ములమ్మ అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.

వనపర్తి,జూన్25(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రామాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన జమ్ములమ్మ అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ దేవతల పండుగలు గ్రామ ప్రజల మధ్య ఐక్యత, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.జమ్ములమ్మ అమ్మవారి కృపతో రామాపురం గ్రామంతో పాటు వనపర్తి నియోజకవర్గం మొత్తం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షుడు యాపర్ల రామిరెడ్డి, పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, నాయకులు రంజిత్ కుమార్, సురేందర్ గౌడ్, వెంకటేష్ సాగర్, గ్రామ నాయకులు సత్యనారాయణ రెడ్డి, భగవంతుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం.. హుజూరాబాద్ ఏసపీ . మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం.. హుజూరాబాద్ ఏసపీ .
పూర్తిగా దూరంగా ఉండాలి – సమాచారం అందించిన వారి వివరాలు గోప్యమే హుజూరాబాద్, జూన్ 25(తెలంగాణ ముచ్చట్లు ): సమాజాన్ని మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలంటే ప్రజల...
హుజురాబాద్‌లో పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం.
జమ్ములమ్మ అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
సొంత గ్రామంలోనే ఓటు హక్కు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి.
పశువుల ఆరోగ్యమే రైతు ఆర్థిక బలం.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.
జమ్ములమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి.