పశువుల ఆరోగ్యమే రైతు ఆర్థిక బలం.

గోపాల్పూర్‌లో ఉచిత ఎల్‌ఎస్‌డీ నిరోధక టీకాల శిబిరం.

పశువుల ఆరోగ్యమే రైతు ఆర్థిక బలం.

ఎల్కతుర్తి, జూన్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలోని సబ్ సెంటర్‌లో గురువారం పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఎల్‌ఎస్‌డీ (లంపీ స్కిన్ డిసీజ్) నిరోధక టీకాల శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ శ్రీమతి కె. లక్ష్మి శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ పి. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పశువుల ఆరోగ్యమే రైతు ఆర్థిక బలమని అన్నారు. పాడి పశువులకు ఎల్‌ఎస్‌డీ వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీకాలు వేస్తున్నామని తెలిపారు. టీకాలు వేసిన పశువుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరుస్తున్నామని చెప్పారు. రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
పశుసంపద రైతు కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోందని, పశువులను వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవడం ద్వారా రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారని పేర్కొన్నారు. ఎల్‌ఎస్‌డీ వ్యాధి నివారణకు టీకాలే అత్యంత ప్రభావవంతమైన మార్గమని రైతులకు అవగాహన కల్పించారు.
సర్పంచ్ కె. లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఉచిత టీకాల కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలోని ప్రతి పాడి పశువుకు టీకాలు వేయించి వ్యాధి రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వీఎల్‌వో సతీష్, జేఈవో రజిత, రాకేష్ రెడ్డి, ఎల్‌ఎస్‌ఏలు, గోపాలమిత్రలు, రైతు సోదరులు పాల్గొన్నారు. శిబిరంలో పెద్ద సంఖ్యలో పాడి పశువులకు ఎల్‌ఎస్‌డీ టీకాలు వేసి, వ్యాధి నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం.. హుజూరాబాద్ ఏసపీ . మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం.. హుజూరాబాద్ ఏసపీ .
పూర్తిగా దూరంగా ఉండాలి – సమాచారం అందించిన వారి వివరాలు గోప్యమే హుజూరాబాద్, జూన్ 25(తెలంగాణ ముచ్చట్లు ): సమాజాన్ని మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలంటే ప్రజల...
హుజురాబాద్‌లో పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం.
జమ్ములమ్మ అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
సొంత గ్రామంలోనే ఓటు హక్కు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి.
పశువుల ఆరోగ్యమే రైతు ఆర్థిక బలం.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.
జమ్ములమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి.