ఓటర్ల జాబితా సవరణను విజయవంతం చేయాలి.

సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ .

ఓటర్ల జాబితా సవరణను విజయవంతం చేయాలి.

పెద్దమందడి,జూన్26(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మణిగిల్ల  గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు.నకిలీ, ద్వంద్వ ఓట్ల తొలగింపుతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగనున్నందున, ఇంటి వద్దకు వచ్చే అధికారులకు అవసరమైన వివరాలు అందించి, తమ ఓటరు వివరాలను పరిశీలించి సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, గ్రామ స్థాయి ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మహతి వేదికపై అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన. మహతి వేదికపై అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన.
వనపర్తి,జూన్27(తెలంగాణ ముచ్చట్లు): తిరుపతిలోని శ్రీ మహతి ఆడిటోరియంలో స్వామివారి దివ్య సన్నిధిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో సాత్విక కూచిపూడి అకాడమీ' విద్యార్థులు తమ అద్భుత కూచిపూడి నృత్య...
హెలెన్ కెల్లర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం.
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మూడు దశాబ్దాల ఉద్యమ సేవకు దక్కిన గుర్తింపు.
చెత్తకు చెక్.. పచ్చదనానికి శ్రీకారం!
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.60 లక్షల బీమా.. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం.