ఓటర్ల జాబితా సవరణను విజయవంతం చేయాలి.
సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ .
పెద్దమందడి,జూన్26(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు.నకిలీ, ద్వంద్వ ఓట్ల తొలగింపుతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగనున్నందున, ఇంటి వద్దకు వచ్చే అధికారులకు అవసరమైన వివరాలు అందించి, తమ ఓటరు వివరాలను పరిశీలించి సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, గ్రామ స్థాయి ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


Comments