ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

పెద్దమందడి,జూన్27(తెలంగాణ ముచ్చట్లు):

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పెద్దమందడి మండలం  మోజర్ల గ్రామ సర్పంచ్, బీఎల్‌వో చంద్రశేఖర్ కోరారు. శనివారం  మోజర్ల గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని, కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.అలాగే ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, చిరునామా మార్పు, ఇతర వివరాల సవరణలు అవసరమైన వారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ శారద , గట్టు మన్నెం, నరసింహా, కొండన్న గ్రామ ప్రజలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మహతి వేదికపై అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన. మహతి వేదికపై అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన.
వనపర్తి,జూన్27(తెలంగాణ ముచ్చట్లు): తిరుపతిలోని శ్రీ మహతి ఆడిటోరియంలో స్వామివారి దివ్య సన్నిధిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో సాత్విక కూచిపూడి అకాడమీ' విద్యార్థులు తమ అద్భుత కూచిపూడి నృత్య...
హెలెన్ కెల్లర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం.
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మూడు దశాబ్దాల ఉద్యమ సేవకు దక్కిన గుర్తింపు.
చెత్తకు చెక్.. పచ్చదనానికి శ్రీకారం!
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.60 లక్షల బీమా.. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం.