మూడు దశాబ్దాల ఉద్యమ సేవకు దక్కిన గుర్తింపు.
జమ్మికుంట టౌన్ జూన్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండల సీపీఎం పార్టీ కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన జక్కుల రమేష్ యాదవ్కు జమ్మికుంట మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. సంఘం మండల అధ్యక్షుడు సింగవేనా ఓదెలు యాదవ్ శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, గత మూడు దశాబ్దాలుగా కార్మికునిగా, కార్మిక సంఘం నాయకునిగా జక్కుల రమేష్ యాదవ్ నిరంతరం కార్మికుల హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఉద్యమాల్లో ముందుండి పోరాడుతున్నారని కొనియాడారు. అలాంటి ఉద్యమ నాయకుడిని సీపీఎం పార్టీ మండల కార్యదర్శిగా ఎన్నుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు.
నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మండలంలో ప్రజా సమస్యల పరిష్కారం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మరింత ఐక్యంగా ఉద్యమాలను ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పల్లెబోయిన రాజు, సంపత్ యాదవ్, తెడ్ల ఓదెలు యాదవ్, శ్రీనివాస్, దండిగారి సతీష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


Comments