మూడు దశాబ్దాల ఉద్యమ సేవకు దక్కిన గుర్తింపు.

మూడు దశాబ్దాల ఉద్యమ సేవకు దక్కిన గుర్తింపు.

జమ్మికుంట టౌన్ జూన్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండల సీపీఎం పార్టీ కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన జక్కుల రమేష్ యాదవ్‌కు జమ్మికుంట మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. సంఘం మండల అధ్యక్షుడు సింగవేనా ఓదెలు యాదవ్ శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, గత మూడు దశాబ్దాలుగా కార్మికునిగా, కార్మిక సంఘం నాయకునిగా జక్కుల రమేష్ యాదవ్ నిరంతరం కార్మికుల హక్కులు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఉద్యమాల్లో ముందుండి పోరాడుతున్నారని కొనియాడారు. అలాంటి ఉద్యమ నాయకుడిని సీపీఎం పార్టీ మండల కార్యదర్శిగా ఎన్నుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు.

నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మండలంలో ప్రజా సమస్యల పరిష్కారం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మరింత ఐక్యంగా ఉద్యమాలను ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పల్లెబోయిన రాజు, సంపత్ యాదవ్, తెడ్ల ఓదెలు యాదవ్, శ్రీనివాస్, దండిగారి సతీష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మహతి వేదికపై అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన. మహతి వేదికపై అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన.
వనపర్తి,జూన్27(తెలంగాణ ముచ్చట్లు): తిరుపతిలోని శ్రీ మహతి ఆడిటోరియంలో స్వామివారి దివ్య సన్నిధిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో సాత్విక కూచిపూడి అకాడమీ' విద్యార్థులు తమ అద్భుత కూచిపూడి నృత్య...
హెలెన్ కెల్లర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం.
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మూడు దశాబ్దాల ఉద్యమ సేవకు దక్కిన గుర్తింపు.
చెత్తకు చెక్.. పచ్చదనానికి శ్రీకారం!
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.60 లక్షల బీమా.. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం.