ప్రజల ఇబ్బందులు గుర్తించి తక్షణ చర్యలు.. నీటిని తొలగించిన కౌన్సిలర్.
జమ్మికుంట టౌన్ జూలై 03 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంటలో కురిసిన భారీ వర్షానికి నాయిని చెరువు కట్టపై వర్షపు నీరు నిలిచిపోవడంతో మోత్కులగూడెం, మాచనపల్లి గ్రామాలకు వెళ్లే రహదారిపై రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విషయం తెలుసుకున్న జమ్మికుంట మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ పొనగంటి విష్ణువర్ధన్ వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో చెరువు కట్టపై నిలిచిన వర్షపు నీటిని తొలగించే చర్యలు చేపట్టారు.
సకాలంలో చేపట్టిన చర్యలతో రహదారిపై నీరు తొలగిపోవడంతో జమ్మికుంట నుంచి మోత్కులగూడెం, మాచనపల్లి గ్రామాలకు వెళ్లే ప్రజల రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్, మున్సిపల్ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.


Comments