జమ్మికుంట మున్సిపల్లో ఘనంగా మాజీ సీఎం రోశయ్య జయంతి వేడుకలు.

జమ్మికుంట మున్సిపల్లో ఘనంగా మాజీ సీఎం రోశయ్య జయంతి వేడుకలు.

జమ్మికుంట టౌన్ జూలై 4 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక మరియు తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 16 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరుదైన నాయకుడిగా రోశయ్య దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. మృదుస్వభావి, నిజాయితీ గల ప్రజానాయకుడైన రోశయ్య జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. యువత రోశయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మేనేజర్ జి. రాజిరెడ్డి, కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హైవే దిగి తప్పించుకోవాలనుకున్నారు... సత్తుపల్లిలో చిక్కారు.. హైవే దిగి తప్పించుకోవాలనుకున్నారు... సత్తుపల్లిలో చిక్కారు..
- ఒడిశా నుంచి హైదరాబాద్‌కు భారీ గంజాయి రవాణా భగ్నం.- రూ.89.13 లక్షల విలువైన 166.360 కిలోల గంజాయి స్వాధీనం.- డ్రైవర్ అరెస్టు.. మరో ఇద్దరి కోసం...
IIITలో సీటు సాధించిన వెన్నలకు స్ఫూర్తి ఫౌండేషన్ అండ.
జమ్మికుంట మున్సిపల్లో ఘనంగా మాజీ సీఎం రోశయ్య జయంతి వేడుకలు.
జమ్మికుంటలో బీఆర్‌ఏఓయూ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.
ఏఎస్ఐ శివపార్వతి సేవలు అభినందనీయం.
అర్హులందరికీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందించాలి.
కుళ్లిన కోడిగుడ్ల పంపిణీ.. అంగన్వాడీ కేంద్రంపై గ్రామస్తుల ఆగ్రహం.