25వ వార్డులో ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతo.

కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు.

25వ వార్డులో ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతo.

హుజురాబాద్, జూలై 7(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్‌రావు పాల్గొని ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే సవరించుకోవాలని ఆమె సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, సమర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు (బి ఎల్ ఓ లు), బీఎల్‌ఏలు (బి ఎల్ ఏ లు), వార్డ్ ఆఫీసర్, కోఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హరిత బావుపేట నిర్మాణానికి శ్రీకారం. హరిత బావుపేట నిర్మాణానికి శ్రీకారం.
ఎల్కతుర్తి, జూలై 7( తెలంగాణ ముచ్చట్లు):  హరిత బావుపేట నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఎల్కతుర్తి మండలంలోని బావుపేట గ్రామంలో మంగళవారం రోడ్డు ఇరువైపులా విస్తృత స్థాయిలో మొక్కలు...
వెల్టూర్ ఉన్ని చేనేత సహకార సంఘం అధ్యక్షులుగా చింతల వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక.
ఘనంగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలు.
దొడగుంటపల్లిలో ఘనంగా ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ.
25వ వార్డులో ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతo.
వెల్టూర్ చేనేత సంఘం అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లకు ఘన సన్మానం.
అందమైన చేతిరాతతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది.