ఘనంగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలు.
వనపర్తి,జులై 07(తెలంగాణ ముచ్చట్లు):
పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ 62వ జన్మదినోత్సవం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదిగ ఉద్యోగుల సమాఖ్య వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులు శ్రీ గద్వాల కృష్ణ హాజరై, జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌక్ వద్ద కేక్ కోసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు.అనంతరం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు యాపిల్లు, అరటిపండ్లు పంపిణీ చేసి మానవతా సేవలను చాటిచెప్పారు.ఈ కార్యక్రమాన్ని మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు బొరెల్లి వెంకటయ్య, సీనియర్ నాయకులు కేశపాగ కేశవులు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొమ్ము కేశవులు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పద్మశ్రీ మంద కృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన కోసం ఆయన చేస్తున్న నిరంతర పోరాటాన్ని కొనియాడారు.


Comments