వంగర గ్రామంలో బావిలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం కలకలం.
Views: 0
On
భీమదేవరపల్లి, జూలై 7(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ బావిలో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమవడంతో గ్రామంలో కలకలం రేగింది.
స్థానికులు బావిలో మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బావి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఆమె గుర్తింపు కోసం ప్రయత్నాలు చేపట్టడంతో పాటు, మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
07 Jul 2026 21:49:48
ఎల్కతుర్తి, జూలై 7( తెలంగాణ ముచ్చట్లు):
హరిత బావుపేట నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఎల్కతుర్తి మండలంలోని బావుపేట గ్రామంలో మంగళవారం రోడ్డు ఇరువైపులా విస్తృత స్థాయిలో మొక్కలు...


Comments