వ్యవసాయ సాగు సీజన్‌లో రైతులు అప్రమత్తంగా ఉండాలి: పుల్లూరి స్వప్న సదానందం.

వ్యవసాయ సాగు సీజన్‌లో రైతులు అప్రమత్తంగా ఉండాలి: పుల్లూరి స్వప్న సదానందం.

జమ్మికుంట టౌన్ జూలై 07 (తెలంగాణ ముచ్చట్లు): 

ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం సూచించారు.
ప్రభుత్వ అనుమతి పొందిన ఎరువుల దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా కొనుగోలు బిల్లులను భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఎరువుల దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, నిర్ణీత ధరలకే ఎరువులను విక్రయించాలని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దుకాణాల్లో ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించి, తగిన నిల్వలను ఉంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. రైతులు, వ్యాపారులు పరస్పర సహకారంతో ఈ వ్యవసాయ సీజన్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హరిత బావుపేట నిర్మాణానికి శ్రీకారం. హరిత బావుపేట నిర్మాణానికి శ్రీకారం.
ఎల్కతుర్తి, జూలై 7( తెలంగాణ ముచ్చట్లు):  హరిత బావుపేట నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఎల్కతుర్తి మండలంలోని బావుపేట గ్రామంలో మంగళవారం రోడ్డు ఇరువైపులా విస్తృత స్థాయిలో మొక్కలు...
వెల్టూర్ ఉన్ని చేనేత సహకార సంఘం అధ్యక్షులుగా చింతల వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక.
ఘనంగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలు.
దొడగుంటపల్లిలో ఘనంగా ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ.
25వ వార్డులో ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతo.
వెల్టూర్ చేనేత సంఘం అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లకు ఘన సన్మానం.
అందమైన చేతిరాతతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది.