జమ్మికుంట మున్సిపల్ కార్యాలయానికి ట్రైనింగ్ కలెక్టర్ హరిప్రసాద్.
జమ్మికుంట టౌన్ జూలై 07 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ట్రైనింగ్ కలెక్టర్ పి. హరిప్రసాద్కు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఘన స్వాగతం పలికి శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై ట్రైనింగ్ కలెక్టర్కు అధికారులు వివరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణను ఆయన పరిశీలించారు.
తర్వాత వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ట్రైనింగ్ కలెక్టర్ పి. హరిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్తో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం సామాజిక బాధ్యతగా భావించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మేనేజర్ జి. రాజిరెడ్డి, వైస్ చైర్మన్ ముంతాజ్ జావేద్ అలీ, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments