గోదావరి జలాలు అందించిన మంత్రి తుమ్మలకు రైతుల పాలాభిషేకం.

గోదావరి జలాలు అందించిన మంత్రి తుమ్మలకు రైతుల పాలాభిషేకం.

- కల్లూరు మండల రైతుల హర్షం.
- సాగునీటి కల సాకారం చేశారంటూ కృతజ్ఞతలు.

సత్తుపల్లి, జూలై 8 (తెలంగాణ ముచ్చట్లు):

సీతారామ ప్రాజెక్టు ద్వారా మోటార్లు ప్రారంభించి రాజీవ్ లింక్ కెనాల్‌ మార్గంగా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌తో పాటు నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందించిన సందర్భంగా కల్లూరు మండల రైతులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాగునీటి కలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాకారం చేశారని కొనియాడారు. గోదావరి జలాలు తమ పొలాలకు చేరేలా కృషి చేసిన మంత్రికి రైతాంగం ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. సాగునీరు అందడంతో పంటల సాగు విస్తరిస్తుందని, రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా రైతులు స్వచ్ఛందంగా పాల్గొని పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎల్కతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు. ఎల్కతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.
ఎల్కతుర్తి, జూలై 8 (తెలంగాణ ముచ్చట్లు): మండల పరిధిలోని ది విశాల సహకార బ్యాంకు నూతన పాలకవర్గంలో నామినేటెడ్ సొసైటీ డైరెక్టర్ పదవుల నియామకాలపై కాంగ్రెస్ పార్టీలో...
నారు సిద్ధం, నీటి కోసం నిరీక్షణ వర్షాభావంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం.
కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.
డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
కాంగ్రెస్ నాయకుల యోగక్షేమాలు తెలుసుకున్న ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని.
24వ వార్డులో ఎస్‌ఐఆర్ ఫారమ్‌పై ఇంటింటా అవగాహన.
ప్రజా సమస్యలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి: మిల్కూరి వాసుదేవరెడ్డి.