కాంగ్రెస్ నాయకుల యోగక్షేమాలు తెలుసుకున్న ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని.
హుజురాబాద్, జూలై 8(తెలంగాణ ముచ్చట్లు ):
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సంక్షేమమే పార్టీ బలోపేతానికి పునాది అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు గారు పేర్కొన్నారు. హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు గారితో కలిసి ఆయన హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు మేకల తిరుపతి గారిని, వార్డు అధ్యక్షులు మోతే కుమారస్వామి గారిని పరామర్శించారు.
ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నాయకులు, ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజా సేవలో, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. అవసరమైన సహాయ సహకారాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు చేస్తున్న సేవలు అమూల్యమని ప్రణవ్ బాబు అన్నారు. ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయడంలో టౌన్ అధ్యక్షులు మేకల తిరుపతి, వార్డు అధ్యక్షులు మోతే కుమారస్వామి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర ఆప్యాయత, ఐక్యత మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తల సంక్షేమానికి కాంగ్రెస్ కుటుంబం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. అనారోగ్యంతో ఉన్న నాయకులు త్వరగా కోలుకుని ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ వారికి ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాయకుల పరామర్శతో మేకల తిరుపతి, మోతే కుమారస్వామి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.


Comments