24వ వార్డులో ఎస్‌ఐఆర్ ఫారమ్‌పై ఇంటింటా అవగాహన.

బీజేపీ నేత రాజేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రచారం.

24వ వార్డులో ఎస్‌ఐఆర్ ఫారమ్‌పై ఇంటింటా అవగాహన.

జమ్మికుంట టౌన్ జూలై 08 (తెలంగాణ ముచ్చట్లు): 

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా 24వ వార్డులోని 175వ బూత్ పరిధిలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు రాజేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారమ్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజేష్ ఠాకూర్ ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారమ్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఓటరు తమ వ్యక్తిగత వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని, అవసరమైన పత్రాలను సమర్పించి ఓటరు జాబితాలో పేరు సరిగా నమోదయ్యేలా చూసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఓటరి పాత్ర కీలకమని పేర్కొంటూ, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎల్కతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు. ఎల్కతుర్తి కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.
ఎల్కతుర్తి, జూలై 8 (తెలంగాణ ముచ్చట్లు): మండల పరిధిలోని ది విశాల సహకార బ్యాంకు నూతన పాలకవర్గంలో నామినేటెడ్ సొసైటీ డైరెక్టర్ పదవుల నియామకాలపై కాంగ్రెస్ పార్టీలో...
నారు సిద్ధం, నీటి కోసం నిరీక్షణ వర్షాభావంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం.
కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.
డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.
కాంగ్రెస్ నాయకుల యోగక్షేమాలు తెలుసుకున్న ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని.
24వ వార్డులో ఎస్‌ఐఆర్ ఫారమ్‌పై ఇంటింటా అవగాహన.
ప్రజా సమస్యలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి: మిల్కూరి వాసుదేవరెడ్డి.