జన విజ్ఞాన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం.
Views: 0
On
వేలేరు, జులై 08 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలంలో జన విజ్ఞాన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని సభ్యత్వం నమోదు చేసుకున్నారు. జన విజ్ఞాన వేదిక చేపడుతున్న సామాజిక, విద్యా, శాస్త్రీయ అవగాహన కార్యక్రమాలకు మద్దతుగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా గుడికందుల రమేష్ మాట్లాడుతూ, సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక నిరంతరం కృషి చేస్తోందన్నారు. యువత ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గ్రామస్థుల నుంచి విశేష స్పందన లభించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 Jul 2026 21:37:50
ఎల్కతుర్తి, జూలై 8 (తెలంగాణ ముచ్చట్లు):
మండల పరిధిలోని ది విశాల సహకార బ్యాంకు నూతన పాలకవర్గంలో నామినేటెడ్ సొసైటీ డైరెక్టర్ పదవుల నియామకాలపై కాంగ్రెస్ పార్టీలో...


Comments