చిన్న కాలువలను రద్దు చేయాలని రైతుల వినతి.
పెద్దమందడి,జూలై08(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జంగమాయ పల్లి గ్రామంలో చిన్న కాలువల నిర్మాణాన్ని రద్దు చేయాలని కోరుతూ గ్రామ రైతులు సూపరింటెండింగ్ ఇంజనీర్కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామంలో అధిక శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని, ప్రతి రైతుకు స్వల్ప విస్తీర్ణంలోనే సాగుభూమి ఉందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో రైతుల భూముల మధ్యుగా చిన్న కాలువలను ఏర్పాటు చేస్తే ఇప్పటికే తక్కువగా ఉన్న భూమి మరింత తగ్గిపోతుందని, దీంతో రైతుల జీవనోపాధి దెబ్బతినడంతో పాటు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే బసిరెడ్డి చెరువుకు నీరు చేరినప్పుడు ఇప్పటికే ఉన్న తూములు, కాలువల ద్వారానే ప్రతి ఎకరానికి సాగునీరు అందుతోందని, కొత్తగా ప్రతిపాదించిన చిన్న కాలువల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో గ్రామ రైతులందరూ సమావేశమై ఏకగ్రీవంగా చిన్న కాలువల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత చిన్న కాలువల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని సూపరింటెండింగ్ ఇంజనీర్ను వినతిపత్రం ద్వారా కోరారు.


Comments