శ్రీ గట్టు మల్లికార్జున స్వామి ఆలయం హుండీల లెక్కింపు
Views: 26
On
వేలేరు, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలోని శ్రీ గట్టు మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీల లెక్కింపును శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈ ఓ నాగేశ్వరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
పట్నాలు, బోనాలు, కేశకండన, అభిషేకాలు, అర్చనల ద్వారా 36 రోజుల కాలానికి గాను రూ. 5,64,170 సమకూరగా, హుండీల ద్వారా రూ. 1,96,599 వచ్చినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
మొత్తం కలిపి రూ. 7,60,770 (ఏడు లక్షల అరవై వేల ఏడు వందల డెబ్బై) రూపాయలు వచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పల్లె నిరంజన్ రెడ్డి, సర్పంచ్ జక్కుల మౌనిక, ఉపసర్పంచ్ దయాకర్, డైరెక్టర్లు, మాజీ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments