వెల్టూరులో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన తహసీల్దార్ మల్లికార్జున్.
పెద్దమందడి,జూలై14(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తహసీల్దార్ మల్లికార్జున్ మంగళవారం పరిశీలించారు. కార్యక్రమం నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కార్యక్రమాన్ని పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని ఆదేశించారు.అనంతరం కార్యక్రమానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ప్రజలకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, సందేహాలకు వెంటనే సమాధానాలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీ ఎల్ ఓ, బీ ఎల్ ఏ లు, బిజెపి రమేష్ పాల్గొన్నారు.


Comments