భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమారస్వామికి బీజేపీ సిద్ధిపేట జిల్లా ఉపాధ్యక్ష పదవి.
భీమదేవరపల్లి, జూలై 1, తెలంగాణ ముచ్చట్లు : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న "సంఘటన్ పర్వ్" కార్యక్రమంలో భాగంగా బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ నూతన జిల్లా కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ కార్యవర్గంలో భీమదేవరపల్లి మండలానికి చెందిన సర్పంచ్ మాచర్ల కుమారస్వామి నీ సిద్ధిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ అవకాశాన్ని కల్పించిన కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు , జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ భీమదేవరపల్లి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన మాచర్ల కుమారస్వామి మాట్లాడుతూ, ఇది కేవలం బాధ్యత కాదు... నాపై పార్టీ ఉంచిన నమ్మకం. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలవడానికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో పనిచేస్తాను అని తెలిపారు.
ఈ నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


Comments