ఒక్కటే సర్క్యూట్‌లో 15 అవార్డులు.. జాతీయ వేదికపై పొనగంటి రాజు ఖ్యాతి.

ఒక్కటే సర్క్యూట్‌లో 15 అవార్డులు.. జాతీయ వేదికపై పొనగంటి రాజు ఖ్యాతి.

IMG-20260711-WA0017IMG-20260711-WA0018

జమ్మికుంట జులై 11: (తెలంగాణ ముచ్చట్లు)

జమ్మికుంటకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ పొనగంటి రాజు జాతీయస్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ (ఎఫ్‌ఐపీ) నిర్వహించిన జాతీయస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ఆయన చిత్రాలు విశేషంగా ఆకట్టుకుని అరుదైన రికార్డును నెలకొల్పాయి.
ఒక్కటే సర్క్యూట్‌లో మొత్తం 15 అవార్డులు సాధించి ఫోటోగ్రఫీ రంగంలో విశేష గుర్తింపు పొందారు. ఇందులో 2 మెమోరియల్ ట్రోఫీ బెస్ట్ ఎంట్రెంట్ అవార్డులు, 8 బంగారు పతకాలు, 5 ఎఫ్‌ఐపీ రిబ్బన్లు ఉన్నాయి. ఒకే సర్క్యూట్‌లో ఇన్ని అవార్డులు సాధించడం అరుదైన ఘనతగా ఫోటోగ్రఫీ వర్గాలు అభినందిస్తున్నాయి.
పొనగంటి రాజు సాధించిన ఈ విజయంతో జమ్మికుంట పేరు జాతీయస్థాయిలో మరోసారి మార్మోగింది. ఆయనకు పలువురు ఫోటోగ్రాఫర్లు, కళాభిమానులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు.
హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర...
భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన వాటర్ కూలర్ విరాళం.
ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు.
ఉమ్మడి జిల్లా స్థాయి స్మారక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం.
హుజురాబాద్‌లో పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం.
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలని కాంగ్రెస్ అభిమానుల విజ్ఞప్తి.
ఘనంగా చిల్డ్రన్స్ పార్లమెంట్ వార్షిక దినోత్సవం.