నులిపురుగుల నివారణకు విద్యార్థులకు ఆల్బెండజోల్ పంపిణీ.
Views: 1
On
పెద్దమందడి,జులై13(తెలంగాణ ముచ్చట్లు):
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (ఎన్డీడీ) సందర్భంగా సోమవారం పెద్దమందడి మండలం వెల్టూర్ జడ్పీ ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు సమక్షంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎన్ఎం తారాదేవి విద్యార్థులకు నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం ఆశా కార్యకర్తల సహకారంతో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Jul 2026 22:03:50
ఖమ్మం బ్యూరో,జూలై 11(తెలంగాణ ముచ్చట్లు )
ఖమ్మంకేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ, ఈ నెల 27వ తేదీన "తెలంగాణ జర్నలిస్టుల ఛలో...


Comments