కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య ఫైర్.. ఘనపూర్ అభివృద్ధి శూన్యమని విమర్శ.
వేలేరు, జూలై 16 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలంలోని మల్లికుదుర్ల, పీచర గ్రామాల్లో ఓటరు జాబితా పరిశీలనలో భాగంగా బీఎల్వోలతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు.
ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని, అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. ఘనపూర్కు అన్యాయం చేశారని విమర్శిస్తూ, కడియం శ్రీహరికి రాజకీయ సమాధి కట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చినట్లు తెలిపారు.
జూలై 1లోపు వేలేరు మండలంలోని మద్దెలగూడెం, పీచర, శాలపల్లి సహా పలు గ్రామాలకు నీళ్లు అందిస్తామని చెప్పి ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో "కడియం మార్క్" పేరుతో చెప్పుకునే అభివృద్ధి ఏదీ లేదని, ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు.ఈ కార్యక్రమం లో వేలేరు మండల కన్వీనర్ కోయ్యడ మహేందర్, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధి మారబోయిన రాజు, గోళ్లేనా రమేష్, సోమిరెడ్డి, విజేందర్ రెడ్డి, భూపతి రాజు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments