సమృద్ధిగా వర్షాలు కురవాలని కప్పతల్లి ఆట.

హుజురాబాద్ 19వ వార్డులో మహిళలు, చిన్నారులతో ప్రత్యేక పూజలు.

సమృద్ధిగా వర్షాలు కురవాలని కప్పతల్లి ఆట.

హుజురాబాద్, జూలై 16(తెలంగాణ ముచ్చట్లు ):

సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని 19వ వార్డులో కౌన్సిలర్ గోస్కుల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గురువారం సంప్రదాయ కప్పతల్లి ఆట నిర్వహించారు.
ఈ సందర్భంగా ముందుగా గ్రామదేవతలకు జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు, చిన్నారులు కలిసి ఒక కప్పను ప్రతీకగా అలంకరించి, ఇంటింటికీ తిరుగుతూ వర్షదేవుడిని ప్రార్థించే జానపద గీతాలు ఆలపించారు. గ్రామస్తులు సంప్రదాయం ప్రకారం కప్పపై నీళ్లు పోసి, బియ్యం తదితర ధాన్యాలను దానం చేస్తూ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు.
తరువాత సేకరించిన ధాన్యాలతో సామూహికంగా వంట చేసి నైవేద్యం సమర్పించారు. గ్రామ శ్రేయస్సు, రైతుల సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ గోస్కుల రాజ్‌కుమార్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా...
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.