మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
పెద్దమందడి,జూలై17(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జంగమాయపల్లి గ్రామానికి చెందిన తాళ్ల సుధాకర్ గౌడ్ ఆకస్మిక మృతిపై బీఆర్ఎస్ నాయకుడు కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ..ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సందేశం పంపించారు.కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి తరఫున బీఆర్ఎస్ నాయకులు మృతుడి కుటుంబానికి రూ.5,000/- వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ తీరని లోటును భరించే మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి నాగరాజు, ఉప సర్పంచ్ కొండల్, మాజీ సర్పంచ్ సత్యం, శ్రీను గౌడ్, యాదగిరి, జనార్ధన్ గౌడ్, చిన్న రాజు, మేదరి శాంతన్న, కార్తిక్, బడ్డమర్రి శాంతన్న తదితరులు పాల్గొన్నారు.


Comments