సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.

సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.

- ఎస్‌ఐఆర్‌పై శ్రేణులకు అవగాహన.
- కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శలు.

సత్తుపల్లి, జూలై 17 (తెలంగాణ ముచ్చట్లు): 

సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు ఎస్‌ఐఆర్ అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఓటు చోరీపై చర్చ జరుగుతుండగా, తెలంగాణలో మాత్రం అభివృద్ధి పనుల క్రెడిట్ చోరీ జరుగుతోందని ఆరోపించారుIMG-20260717-WA0020. సీతారామ ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగిందని, ఆ ప్రాజెక్టు ఘనతను కాంగ్రెస్ ప్రభుత్వం సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రాజెక్టు క్రెడిట్ కోసం కాంగ్రెస్ మంత్రుల మధ్యే పోటీ నెలకొందని, ఒక మంత్రి పర్యటన గురించి మరో మంత్రికి తెలియని పరిస్థితి నెలకొనడం వారి అంతర్గత విభేదాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎల్‌నీనో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన తర్వాతే సాగునీటి పంపులను ప్రారంభించారని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు రెండో ఎండాకాలాన్ని తలపిస్తున్నాయని అన్నారు. గోదావరి జలాలను సమర్థంగా వినియోగించి రైతులకు సకాలంలో సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సర్వేలన్నీ బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్న సండ్ర వెంకట వీరయ్య.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్.
పెద్దమందడి,జులై17(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు ప్రతిపాదనలో భాగంగా జిల్లా...
వాన కోసం భక్తి జలధార.. రంగమ్మపెల్లిలో 200 మంది మహిళల నీరాభిషేకాలు.
ప్రజల భద్రతే లక్ష్యం.. విలాసాగర్‌లో ఏడు సీసీ కెమెరాల ఆవిష్కరణ.
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ నేత కొట్టుకూరి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం.
విద్యార్థుల సంక్షేమంపై డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక దృష్టి.
సత్తుపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.
దమ్మపేటకు సబ్‌కోర్టు మంజూరు చేయాలి.