భూ వివాదం విషాదం.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య.

తల్లి మృతితో మల్యాల గ్రామంలో విషాద ఛాయలు.

భూ వివాదం విషాదం.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య.

ఇల్లందకుంట, జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు):

భూ వివాదం కుటుంబంలో తీవ్ర విషాదానికి దారితీసిన ఘటన ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో చోటుచేసుకుంది. భూ తగాదా నేపథ్యంలో కుమార్తె చేతిలో అవమానానికి గురైన ఓ మహిళ మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మల్యాల గ్రామానికి చెందిన చందగల్ల శంకరయ్య (66) తన చిన్న కుమార్తె రామంచ శైలజ (35), ఆమె భర్త ఆరోగ్యంపై ఇల్లందకుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భూ వివాదం విషయంలో శైలజ తన తల్లి చందగల్ల లక్ష్మి (60)తో ఘర్షణకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మిపై దాడి చేసి, ఇంటి వరకు ఈడ్చుకెళ్లినట్లు ఆరోపించారు.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హుజూరాబాద్ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇల్లందకుంట ఎస్‌హెచ్‌ఓ క్రాంతి కుమార్ తెలిపారు. కుటుంబ కలహాలు చివరకు ప్రాణం తీసిన ఈ ఘటన మల్యాల గ్రామంలో విషాదాన్ని నింపింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి. వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి.
జమ్మికుంట రూరల్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన విషాద...
గడువులోగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలి.
నామ తల్లిదండ్రుల స్మృతి వనాన్ని సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి.
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్రానికి అసలైన పెట్టుబడి : మంత్రి పొంగులేటి.
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సత్కారం.
రాహుల్ గాంధీపై పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు.