నామ తల్లిదండ్రుల స్మృతి వనాన్ని సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్.

నామ తల్లిదండ్రుల స్మృతి వనాన్ని సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్.

ఖమ్మం బ్యూరో, జులై 29(తెలంగాణ ముచ్చట్లు )

జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం ఖమ్మం పర్యటన లో భాగంగా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామంలో ఉన్న నామ ముత్తయ్య–వరమ్మ స్మృతివనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తల్లిదండ్రులు నామ ముత్తయ్య, వరమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సందర్శించి, నామ ముత్తయ్య–వరమ్మ జీవిత విశేషాలు, సమాజానికి అందించిన సేవల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. అక్కడ ప్రదర్శించిన అరుదైన చిత్రాలను పరిశీలించారు. ఆ గ్యాలరీ ఫోటోల విశేషాలను నామ సోదరుడు సీతయ్య వివరించారు.  స్మృతివనంలో ఏర్పాటు చేసిన మొక్కలను, పరిసరాలను పరిశీలించి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.  అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి. వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి.
జమ్మికుంట రూరల్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన విషాద...
గడువులోగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలి.
నామ తల్లిదండ్రుల స్మృతి వనాన్ని సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి.
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్రానికి అసలైన పెట్టుబడి : మంత్రి పొంగులేటి.
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సత్కారం.
రాహుల్ గాంధీపై పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు.