కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్యాయత్నం.

దారి లేకున్నా.. ప్రాణం కోసం పరుగెత్తిన 108.

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్యాయత్నం.

సత్తుపల్లి, జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు): 

సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన పొట్లూరు వేణు (25) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సత్తుపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే బాధితుడి ఇంటికి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురైనా, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ, పైలట్ కట్టం మహేష్ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా బాధితుడి వద్దకు చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతడిని అంబులెన్స్‌లోకి తరలించి, మార్గమధ్యంలోనే అత్యవసర వైద్య సేవలు కొనసాగిస్తూ సత్తుపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి చేర్చారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన 108 సిబ్బంది సేవలను ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్, ఖమ్మం జిల్లా 108 మేనేజర్ ఆలేటి ప్రణయ్ కుమార్ అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి. వ్యవసాయ పనుల్లో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి.
జమ్మికుంట రూరల్ జూలై 29 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ రైతు మృతిచెందిన విషాద...
గడువులోగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలి.
నామ తల్లిదండ్రుల స్మృతి వనాన్ని సందర్శించిన లెఫ్టినెంట్ గవర్నర్.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి.
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్రానికి అసలైన పెట్టుబడి : మంత్రి పొంగులేటి.
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సత్కారం.
రాహుల్ గాంధీపై పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు.