మీసేవ కేంద్రాల్లో పేపర్లెస్ సేవలు అమలు చేయాలి.
పెద్దమందడి తహసిల్దార్ మల్లికార్జున్.
పెద్దమందడి,జూలై20(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని మీసేవ కేంద్రాల్లో పేపర్లెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని తహసిల్దార్ మల్లికార్జున్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో మీసేవ కేంద్రాల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా కుల, ఆదాయ, నివాస, ఓబీసీ, ఈబీసీ తదితర ధ్రువీకరణ పత్రాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత అధికారుల సంతకాల కోసం కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించబడుతుందని తెలిపారు.దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డు వంటి అవసరమైన పత్రాలను తప్పనిసరిగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని మీసేవ నిర్వాహకులకు సూచించారు. తప్పుడు పత్రాలను సమర్పించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పేపర్లెస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో మీసేవ కేంద్రాల నిర్వాహకులు శివకుమార్ చారి, ఈశ్వర్, మహేష్, వెంకటేష్, కార్తీక్, రాజశేఖర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments