ఓటు విలువను నేర్పిన శస్త్ర పబ్లిక్ స్కూల్.
ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన.
హుజూరాబాద్, జూలై 18(తెలంగాణ ముచ్చట్లు ):
హుజూరాబాద్ పట్టణంలోని శస్త్ర పబ్లిక్ స్కూల్లో శనివారం హౌస్ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించారు. కరస్పాండెంట్ వేణుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో సీవీ రామన్, ఆర్యభట్ట, రామానుజన్, చాణక్య హౌస్లకు చెందిన విద్యార్థులు బ్యాలెట్ బాక్స్లో ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రతి హౌస్కు చెందిన సుమారు 45 మంది విద్యార్థులు ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రత్యక్షంగా అనుభవించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వేణుమాధవ్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యం, ఎన్నికల విధానం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చిన్నప్ప
టి నుంచే ప్రజాస్వామ్య స్ఫూర్తి, బాధ్యతాయుతమైన పౌరసత్వ భావన పెంపొందేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ముంజాల సంగీత, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments