పాత్రికేయుడు కోడిక్యాల సురేష్ కుటుంబానికి పరామర్శ...

అనంతరం స్మశానవాటికలో సమస్యలపై ఆరా.

పాత్రికేయుడు కోడిక్యాల సురేష్ కుటుంబానికి పరామర్శ...

హుజురాబాద్, జూలై 20(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసినీ సోమవారం ఈనాడు పాత్రికేయుడు కోడిక్యాల సురేష్ నివాసానికి వెళ్లి, ఇటీవల మృతి చెందిన ఆయన తల్లి లక్ష్మీదేవి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ భారతి బాలాజీ పాల్గొన్నారు.
అనంతరం చైర్‌పర్సన్ పట్టణంలోని స్మశానవాటికను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలపై అధికారులతో చర్చించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ సొల్లు సునీత బాబు, సెంట్రీ ఇన్‌స్పెక్టర్ కిరణ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ వినయ్మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.IMG-20260720-WA0014

Tags:

Post Your Comments

Comments

Latest News

సీఎంఆర్ ధాన్యం లెక్కలపై విజిలెన్స్ నిఘా.. సప్తగిరి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు. సీఎంఆర్ ధాన్యం లెక్కలపై విజిలెన్స్ నిఘా.. సప్తగిరి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు.
జమ్మికుంట టౌన్ జులై 20 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని సప్తగిరి రైస్ మిల్లులో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు....
ఆర్య వైశ్య సంఘం నూతన నాయకులకు బీఎస్పీ నేతల ఘన సన్మానం.
సోయం రాజాబాబుకు తుది వీడ్కోలు.. నివాళులతో పోటెత్తిన రాజకీయ నేతలు.
కోరపల్లి పురాతన శివాలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. దరఖాస్తులకు దేవాదాయ శాఖ ఆహ్వానం.
సంఘ ఐక్యతే లక్ష్యం.. జూలై 27న పెయింటర్స్ వర్క్ బంద్.
పాత్రికేయుడు కోడిక్యాల సురేష్ కుటుంబానికి పరామర్శ...
ఉత్తమ సేవలకు గుర్తింపు.. పోలీసు మిత్రులకు ఘన సన్మానం.