వెల్టూర్ లో బీఎల్‌ఓల కృషి,ప్రజల సహకారంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం.

బీఎల్‌ఓలు అభినందించిన మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి.

వెల్టూర్ లో బీఎల్‌ఓల కృషి,ప్రజల సహకారంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం.

పెద్దమందడి,జులై30(తెలంగాణ ముచ్చట్లు):

బీఎల్‌ఓల అంకితభావం, నిరంతర కృషి, గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను 100 శాతం విజయవంతంగా పూర్తి చేసినట్లు పెద్దమందడి మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి తెలిపారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి కృషి చేసిన బీఎల్‌ఓలను, వారికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన అధికారి కరుణతో పాటు ఈ ప్రక్రియలో భాగస్వాములైన అధికార యంత్రాంగాన్ని రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ అశోక్ సమక్షంలో ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. వెల్టూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తికావడం ఆనందంగా ఉంది. గ్రామ ప్రజల సహకారంతో పాటు బీఎల్‌ఓలు, అధికారి కరుణ, అధికార యంత్రాంగం బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైంది అని పేర్కొన్నారు.ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ, ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడంలో బీఎల్‌ఓలు కీలక పాత్ర పోషించారని అన్నారు. వారికి సమర్థవంతంగా మార్గనిర్దేశం చేసి, ప్రక్రియను సమన్వయం చేసిన అధికారి కరుణ సేవలు అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో పరిణత, బీఎల్‌ఓలు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పామిడిరెడ్డిపల్లిలో ఓటరు దరఖాస్తుల ప్రక్రియ విజయవంతం. పామిడిరెడ్డిపల్లిలో ఓటరు దరఖాస్తుల ప్రక్రియ విజయవంతం.
పెద్దమందడి,జూలై30(తెలంగాణ ముచ్చట్లు): ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిడిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ఓటరు దరఖాస్తులను బూత్‌వారీగా 100% శాతం పూర్తి చేసిన...
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.
పదోన్నతి ఉద్యోగులకు కొత్త ఉత్సాహం.
రైతులు నీటి నిల్వకుంటలు ఏర్పాటు చేసుకోవాలి.
ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక దృష్టి.. ఎస్‌ఐఆర్‌లో సత్తుపల్లికి గుర్తింపు.
వెల్టూర్ లో బీఎల్‌ఓల కృషి,ప్రజల సహకారంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతం.
కుదించిన ప్రింట్ మీడియా వార్త ఇలా ఉంటుంది: